Advertisement

  • క్రునాల్ పాండ్య ను అడ్డుకున్న ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులు ..కారణం ఏంటో తెలుసా !

క్రునాల్ పాండ్య ను అడ్డుకున్న ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులు ..కారణం ఏంటో తెలుసా !

By: Sankar Fri, 13 Nov 2020 10:14 AM

క్రునాల్ పాండ్య ను అడ్డుకున్న ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులు ..కారణం ఏంటో తెలుసా !


టీమిండియా ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-13 సీజన్ ​ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్​ ఆల్​రౌండర్​ క్రునాల్​ పాండ్యాను ముంబై విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.

క్రునాల్ పాండ్యాను కాసేపు విచారించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. పాండ్యా వద్ద బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను ఉన్నాయనే అనుమానంతో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అధికారులు నిలివేశారు. దీనిపై అధికారులు సదరు క్రికెటర్​ను కాసేపు ప్రశ్నించారు.

కొన్ని నివేదికల ప్రకారం.. క్రునాల్​ పాండ్యా వద్ద అనుమతించిన బంగారం కంటే ఎక్కువ ఉండటం వల్ల డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం క్రునాల్​పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బంగారానికి సంబంధించిన అధికారిక పత్రాలను చూపించాల్సిందిగా డీఆర్​ఐ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tags :

Advertisement