క్రునాల్ పాండ్య ను అడ్డుకున్న ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులు ..కారణం ఏంటో తెలుసా !
By: Sankar Fri, 13 Nov 2020 10:14 AM
టీమిండియా ఆల్రౌండర్ క్రునాల్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-13 సీజన్ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ క్రునాల్ పాండ్యాను ముంబై విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.
క్రునాల్ పాండ్యాను కాసేపు విచారించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. పాండ్యా వద్ద బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను ఉన్నాయనే అనుమానంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిలివేశారు. దీనిపై అధికారులు సదరు క్రికెటర్ను కాసేపు ప్రశ్నించారు.
కొన్ని నివేదికల ప్రకారం.. క్రునాల్ పాండ్యా వద్ద అనుమతించిన బంగారం కంటే ఎక్కువ ఉండటం వల్ల డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం క్రునాల్పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బంగారానికి సంబంధించిన అధికారిక పత్రాలను చూపించాల్సిందిగా డీఆర్ఐ అధికారులు విజ్ఞప్తి చేశారు.