ఐపీయల్ 2020 ఫైనల్ కుముందు ముంబై ఇండియన్స్ కు భారీ షాక్...
By: Sankar Fri, 06 Nov 2020 4:31 PM
ఐపీఎల్ 2020 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఢిల్లీ బ్యాట్స్మెన్ బౌల్ట్-బుమ్రా ద్వయం చుక్కలు చూపించింది. 201 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బరిలో దిగగా.. తొలి ఓవర్లోనే పృథ్వీ షా, అజింక్య రహానేలను బౌల్ట్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ బౌలింగ్కు దిగిన బుమ్రా.. అద్భుతమైన యార్కర్తో శిఖర్ ధావన్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బౌల్ట్ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్కు దిగలేదు. తొడ కండరాల గాయంతో బౌల్ట్ మైదానాన్ని వీడగా.. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బౌల్ట్ను తాను మళ్లీ చూడలేదని చెప్పాడు. అతడికైనా గాయం తీవ్రమైంది కాదనిపిస్తోందన్నాడు. ఫైనల్ మ్యాచ్కు మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోగా అతడు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు..
మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. అంచనా వేస్తున్నట్లు మాత్రమే చెప్పాడు. ఒక వేళ బౌల్ట్ గాయం కారణంగా ఫైనల్కు దూరమైతే కచ్చితంగా ముంబై బౌలింగ్ విభాగంపై.. ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం పడుతుంది.