టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ ...మూడు మార్పులతో రాజస్థాన్
By: Sankar Tue, 06 Oct 2020 7:31 PM
ఐపీఎల్-2020 సీజన్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విన్నింగ్ టీమ్నే కొనసాగిస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. మరోవైపు రాజస్థాన్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.
కార్తీక్ త్యాగీ ఐపీఎల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. రాబిన్ ఉతప్ప, జయదేవ్ ఉనద్కత్, రియాన్ పరాగ్లను తుదిజట్టు నుంచి తప్పించారు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, అంకిత్ రాజ్పుత్లను ఎంపిక చేసినట్లు స్మిత్ వివరించాడు.
2015 నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్దే ఆధిపత్యం. 2016, 2017 సీజన్లలో రాజస్థాన్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలోనూ వరుసగా నాలుగు సార్లు ముంబైని రాజస్థాన్ ఓడించింది. ఇవాళ్టి పోరులో గత రికార్డును తిరగరాయాలని ముంబై భావిస్తోంది.