జట్టు కోసం ఏ స్థానంలో అయినా ఆడుతాను ..ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్
By: Sankar Fri, 18 Sept 2020 10:55 AM
ఐపీఎల్లో ఈ సీజన్లోనూ దూసుకెళ్తామని, టైటిల్ నిలబెట్టుకుంటామని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సారి కూడా ఓపెనర్గానే బ్యాటింగ్కు దిగుతానని చెప్పాడు. ఇక్కడ ఆడటం తమ వాళ్లకు కొత్త కావడంతో పరిస్థితులకు అలవాటు పడటం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై తలపడుతుంది.
ఈ నేపథ్యంలో రోహిత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘గతేడాది మొత్తం నేను ఓపెనర్గా ఆడాను. ఇప్పుడూ అదే కొనసాగిస్తాను. ముంబైకే కాదు... టీమిండియాకు ఆడేటపుడు కూడా నేను జట్టు మేనేజ్మెంట్కు స్పష్టంగా చెబుతాను. జట్టు కోసం ఎక్కడైనా ఆడతాను. అయితే అసలు సమస్యే లేనప్పుడు దాని బాగు చేయాలని ప్రయత్నించడంలో అర్థం లేదు’ అని చెప్పాడు.
ఇక్కడి పరిస్థితులతో పెను సవాళ్లు తప్పవని రోహిత్ అభిప్రాయపడ్డాడు.ముఖ్యంగా పిచ్ను అర్థం చేసుకుంటేనే మానసికంగా సన్నద్ధం కాగలం. బ్యాటింగ్ అయినా... బౌలింగ్ అయినా... వికెట్ అర్థమైతే అందుకు తగ్గ ప్రణాళికతో అడుగు వేయొచ్చు. గతంలో ఇక్కడి ప్రదర్శనతో ఇప్పుడైతే ఓ అంచనాకు రాలేం’ అని రోహిత్ వివరించాడు..
కాగా తొలి మ్యాచ్ లో గత ఏడాది ఫైనలిస్టులు అయిన ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్న విషయం తెలిసిందే..అయితే రెండు జట్లు కూడా తమ కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయాయి..చెన్నై జట్టు రైనా , హర్భజన్ వంటి సీనియర్ ఆటగాళ్లను కోల్పోగా , ముంబై జట్టు తమ సీనియర్ ఆటగాడు మలింగా ను దూరం చేసుకుంది..ఇక కోచ్ కోచ్ మహేలా జయవర్ధనే మాట్లాడుతూ... ‘గాయం నుంచి కోలుకొని సుదీర్ఘ కాలం తర్వాత బరిలోకి దిగుతున్న హార్దిక్ పాండ్యాపై అనవసర ఒత్తిడి పెంచబోం, విజయవంతమైన ఫినిషర్లుగా మారెందుకు చాలా మందికి ఇప్పుడు అవకాశాలున్నాయి. క్రిస్ లిన్ రూపంలో నాణ్యమైన డాషిం గ్ ఓపెనర్ ఉన్నప్పటికీ ఈ సారి కూడా రోహిత్–డికాక్ జోడీనే ఇన్నింగ్స్ను ఆరంభిస్తుంది’ అని స్పష్టం చేశాడు.