బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను ...రోహిత్ శర్మ
By: Sankar Thu, 12 Nov 2020 5:12 PM
ఐపీఎల్ 13 వ సీజన్లో మొదటి నుంచి ఆదిపత్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సగర్వంగా టైటిల్ నిలబెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది..
కాగా ఈ టైటిల్ విజయం పై రోహిత్ మాట్లాడుతూ విజయాలను అలవాటుగా మార్చుకోవాలని టోర్నీ ఆరంభంలో నేను చెప్పాను. కుర్రాళ్లు దానిని చేసి చూపించారు. తొలి బంతి నుంచి ఇప్పటి వరకు మేం టైటిల్ లక్ష్యంగానే ఆడాం. సీజన్ మొత్తం మాకు అనుకూలంగా సాగింది. బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్గా నా పని.
అందరూ బాగా ఆడుతుండటంతో అప్పటికప్పుడు తుది జట్టును మార్చుకునే సౌలభ్యం మాకు కలిగింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ చాలా బాగా ఆడారు. మా విజయంతో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. ఐదో టైటిల్ సాధించిన సమయంలో మేం అభిమానుల మధ్య లేకపోవడం నిరాశ కలిగిస్తున్నా వారు వేర్వేరు రూపాల్లో మాకు ఎంతో మద్దతు పలికి ప్రోత్సహించారు’అని పోస్టు మ్యాచ్ ప్రజెంటేషన్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.