సిఎస్కె దారుణ పరాజయం ...ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్
By: Sankar Fri, 23 Oct 2020 10:53 PM
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సీఎస్కేను చుట్టేసిన ముంబై.. ఆపై వికెట్ పడకుండా కొట్టేసింది. సీఎస్కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్ను ఇషాన్ కిషన్(68 నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు), డీకాక్(46 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు)లు వికెట్ పడకుండా ఛేదించారు. వీరిద్దరూ 12 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ముంబైకు ఘనమైన విజయాన్ని అందించారు.
ఇది ముంబైకు ఏడో విజయం కాగా, సీఎస్కే ఎనిమిదో ఓటమి. దాంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. గత మ్యాచ్లో ఓటమితోనే ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు వైదొలిగిన సీఎస్కే.. ఈ మ్యాచ్లో ఓటమితో ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది.ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లకు 114 పరుగులు చేసింది.
ఒక్క సామ్ కరాన్ మినహా ఎవరూ ముంబై బౌలర్లను నిలువరించలేకపోవడంతో సీఎస్కే తక్కువ స్కోరుకే పరిమితమైంది. సీఎస్కే జట్టులో ధోని(16), సామ్ కరాన్(32), శార్దూల్ ఠాకూర్(11)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఈ ముగ్గురిలో కరాన్ ఒక్కడే కాసేపు క్రీజ్లో నిలబడి ముంబై బౌలర్లను ప్రతిఘటించాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు వికెట్లు సాధించగా, బుమ్రా, రాహుల్ చాహర్లు తలో రెండు వికెట్లు సాధించారు. కౌల్టర్నైల్కు వికెట్ దక్కింది.