ఐపీయల్ టైటిల్ గెలిచిన రోహిత్ కు అరుదయిన గౌరవం ...
By: Sankar Wed, 11 Nov 2020 10:40 PM
మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఎల్ఈడీ లైట్లతో అభినందనలు తెలిపింది.
మంగళవారం రాత్రి బుర్జ్ ఖలీఫాపై ముంబై ఇండియన్స్ అనే అక్షరాలను ప్రదర్శించారు. బాణాసంచా వెలుగు మధ్య నీలి రంగులో ముంబై ఇండియన్స్ అనే ఇంగ్లీష్ పదాలు బుర్జ్ ఖలీఫాపై మెరిసిపోయాయి.విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని కూడా బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు.
అయితే ముంబై ఇండియన్స్ అక్షరాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన ఫొటోను ముంబై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం ఇదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్ల ఫొటోలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు.