Advertisement

  • ముంబై డ్రగ్స్ కేసులో షాకింగ్ న్యూస్...జయ సాహాతో నమ్రతా చాట్?

ముంబై డ్రగ్స్ కేసులో షాకింగ్ న్యూస్...జయ సాహాతో నమ్రతా చాట్?

By: chandrasekar Wed, 23 Sept 2020 1:46 PM

ముంబై డ్రగ్స్ కేసులో షాకింగ్ న్యూస్...జయ సాహాతో నమ్రతా చాట్?


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పుడు తెలుగు స్టార్ హీరో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు వినబడుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ముందుగా నెపోటిజమ్ చర్చకొచ్చింది. అనంతరం అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వ్యవహారం. అక్కడ్నించి డ్రగ్స్ కేసులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. హిందీ పరిశ్రమ నుంచి తెలుగు, ఇతర భాషల సెలెబ్రిటీల పేర్లు కూడా డ్రగ్స్ కేసులో వచ్చి చేరుతున్నాయి. సుశాంత్ సింగ్ మరణ వ్యవహారం ప్రస్తుతం ముంబై డ్రగ్స్ కేసుగా మారి౦ది.

కొత్తగా ఈ డ్రగ్స్ కేసులో తెలుగు స్టార్ హీరో మహేశ్ బాబు భార్య, నటి నమ్రత శిరోద్కర్ పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయ౦గా మారింది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి వార్తలు వెలువడలేదు గానీ జాతీయ మీడియాలో ప్రస్తావన వచ్చింది. టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతా చాట్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వచ్చింది. బోంబేలో మంచి ఎండీ ఇస్తానని ప్రామిస్ చేశావ్ ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం అని నమ్రత చాటింగ్ చేసినట్టు కధనాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువులు సినీ ప్రముఖులు, డ్రగ్స్ ఏజెంట్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. నమ్రతా పేరు రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిజానిజాలు తెలియకుండా రాయకూడదని మహేశ్ అభిమానులు విమర్శిస్తున్నారు.

జయ సాహాని ఎన్సీబీ విచారిస్తుండగా నమ్రత పేరు బయటికొచ్చినట్టు తెలుస్తోంది. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు సాహా వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమచారం. ఎందుకంటే జయసాహా గతంలో సుశాంత్‌కు టాలెంట్ మేనేజర్ గా పని చేశారు. మరోవైపు ఇదే కేసులో మరో హిందీ నటి దియా మీర్జా పేరు కూడా వెలుగులోకొచ్చింది. ఆమె మేనేజర్ ను కూడా ఎన్సీబీ అధికారులు విచారణకు పిలవనున్నట్టు సమాచారం. 2019లో దియా మీర్జా డ్రగ్స్ తీసుకున్నారని ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా డ్రగ్ డీలర్ ఎన్సీబీ విచారణలో అంగీకరించినట్టు వినికిడి.

Tags :
|
|

Advertisement