ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 25న
By: chandrasekar Fri, 30 Oct 2020 9:48 PM
భద్రాచలం రామయ్య ఆలయంలో
ముక్కోటి ఉత్సవాలకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 15 నుంచి
జనవరి 4వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు
నిర్వహించనున్నారు.
డిసెంబర్ 24న శ్రీ
సీతారామచంద్రస్వామి వారికి తెప్పోత్సవం జరగనుంది. 25న
ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు సంబంధించి
ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను
నిర్వహించనున్నారు.
Tags :
december |