Advertisement

  • ఆ బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం...!

ఆ బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం...!

By: Anji Sat, 10 Oct 2020 06:16 AM

ఆ బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం...!

మన దేశంలో కుబేరుడు అంటే ముఖేష్ అంబానీ అని చెప్పాలి, అయితే తాజాగా ఆయన కుటుంబం ఓ భారీ విరాళం ఇచ్చింది, ఇదే ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట. ఉత్తరాఖండ్లోని ప్రతీష్టాత్మక చార్థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది.

ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇక్కడ చార్ థామ్ దేవాలయాలు మూసేశారు, ఈ సమయంలో ఇక్కడ ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. జీతాలు కూడా చెల్లించేందుకు ఇబ్బందిగా ఉంది... తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సహకరించాలని దేవస్థానం బోర్డు అదనపు సీఈవో సింగ్.. ముఖేష్ అంబానీకి విజ్ఞప్తి చేశారు.

దీంతో అంబానీ ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో విరాళం అందించారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని చార్ధామ్ యాత్ర అంటారు.. ఇక ప్రతీ ఏడాది ఈ ఆలయాలు మేలో తెరుస్తారు, దీపావళి వరకూ ఉండి ఆ తర్వాత మూసివేస్తారు.. ఈ ఏడాది ఈ సమయంలో కరోనా వ్యాప్తి ఉండటంతో మూసివేశారు ఆలయాలు.

Tags :

Advertisement