Advertisement

  • వెబ్ సిరీస్ ప్రొడక్షన్‌లోకి టీమిండియా కెప్టెన్...!

వెబ్ సిరీస్ ప్రొడక్షన్‌లోకి టీమిండియా కెప్టెన్...!

By: Anji Thu, 01 Oct 2020 2:08 PM

వెబ్ సిరీస్ ప్రొడక్షన్‌లోకి టీమిండియా కెప్టెన్...!

టీమిండియాకి రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెబ్ సిరీస్ ప్రొడక్షన్‌లోకి అడుగు పెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా బాధ్య‌త‌ల‌ను కొన‌సాగిస్తున్నాడు.

ధోని ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన మాజీ టీమిండియా కెప్టెన్ త్వరలో ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. గతేడాది 'రోర్ ఆఫ్ లయన్' అని ధోని ఒక డాక్యుమెంటరీ సిరీస్ ప్రొడ్యూస్ చేశాడు. కొత్త రైటర్ రాసిన బుక్ ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఆ బుక్ పబ్లిష్ కాలేదట.

అది అఘోరా నేపథ్యంలో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. సినిమాగా కంటే సిరీస్ చేస్తే బావుంటుందని తాము నిర్ణయం తీసుకున్నట్టు ధోని భార్య సాక్షి తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ కి ఆమె మేనేజింగ్ డైరెక్టర్. ఇంకా నటీనటులు, లొకేషన్లు ఫైనలైజ్ చేయలేదట.

Tags :

Advertisement