జెర్సీ యువ ఆటగాళ్లకు ఇవ్వడం వెనుక ఉన్న అసలు విషయాన్నీ చెప్పిన ధోని
By: Sankar Wed, 04 Nov 2020 9:54 PM
ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన నేను ఐపీఎల్కు కూడా దూరమవుతానని భావించి యువ ఆటగాళ్లంతా జెర్సీలు తీసుకున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఇదే తన చివరి సీజన్ అని పొరపడ్డారని, కానీ తాను వచ్చే సీజన్ కూడా ఆడుతానని మహీ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2020 లో చెన్నై చివరి ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ 'అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో ఐపీఎల్కు కూడా గుడ్ బై చెబుతానని వారు భావించి ఉంటారు. కానీ అలాంటిదేం లేదు. వచ్చే సీజన్ ఆడుతా' అని ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే సెకండాఫ్లో ఆటగాళ్లంతా ధోనీ సంతకంతో కూడిన జెర్సీ తీసుకోవడంతో పాటు అతనితో ఫొటోలు కూడా తీసుకున్నారు.
ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ నుంచి పాండ్యా బ్రదర్స్తో పాటు ఇతర యువ ఆటగాళ్లు కూడా ధోనీ జెర్సీని అందుకున్నారు. ఈ క్రమంలోనే మహీ ఐపీఎల్కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది. ఇక ఈ సీజన్లో చెన్నై ఏన్నడూ లేని విధంగా విఫలమైంది. ప్రతీ సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్కు చేరిన ఆ జట్టు.. ఈ సారి ఏడో స్థానానికే పరిమితమైంది.