Advertisement

  • ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ధోని మేనేజర్ ..ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు

ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ధోని మేనేజర్ ..ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు

By: Sankar Wed, 08 July 2020 7:34 PM

ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ధోని మేనేజర్ ..ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు



మహేంద్ర సింగ్ ధోని ..మైదానంలోకి అడుగుపెట్టి సరిగ్గా ఏడాది అయింది ..ఏడాది క్రితం ఇదే సమయానికి ఇంగ్లాండ్ లో ప్రపంచ కప్ ఆడిన ధోని , ఆ టోర్నీ లో ఇండియా న్యూజిలాండ్ చేతిలో సెమి ఫైనల్లో ఓటమి పాలు అవ్వడంతో ఇక అప్పటి నుంచి ధోని మైదానం కు దూరమయ్యాడు ..ఇక అప్పటి నుంచి ధోని ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు ..మరోవైపు మరికొంతమంది ధోని తన చివరి మ్యాచ్ ఆడేసాడు ఇక రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలింది అని భావిస్తున్నారు ..అయితే మహేంద్రసింగ్ ధోనీకి రిటైర్మెంట్ ఆలోచనే ప్రస్తుతానికి లేదని అతని మేనేజర్ మిహిర్ దివాకర్ స్పష్టం చేశాడు.

ధోనీ రిటైర్మెంట్‌ వార్తల గురించి తాజాగా అతని మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ మాట్లాడుతూ ‘‘చిన్ననాటి స్నేహితులమైనప్పటికీ.. అతని క్రికెట్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుకోం. కానీ.. ధోనీ మాటల్ని బట్టి చూస్తుంటే.. అతనికి కనీసం రిటైర్మెంట్ ఆలోచనే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతని లక్ష్యం ఒక్కటే ఐపీఎల్‌లో రాణించడం. దానికోసం ఈ ఏడాది ఆరంభంలో అతను దాదాపు 30 రోజులు చెన్నైలో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్‌ కోసం ధోనీ చాలా శ్రమిస్తున్నాడు’’ అని వెల్లడించాడు.

ఐపీఎల్‌లో సత్తాచాటగలిగితే టీమిండియాలోకి ధోనీని ఎంపిక చేసేందుకు తమకేమీ అభ్యంతరం లేదని గత ఏడాది చివర్లోనే భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. కానీ.. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదాపడింది

Tags :
|
|

Advertisement