Advertisement

  • అందుకే ఆ ఓవర్ జడేజాకి ఇచ్చాను ..క్లారిటీ ఇచ్చిన ధోని

అందుకే ఆ ఓవర్ జడేజాకి ఇచ్చాను ..క్లారిటీ ఇచ్చిన ధోని

By: Sankar Sun, 18 Oct 2020 1:40 PM

అందుకే ఆ ఓవర్ జడేజాకి ఇచ్చాను ..క్లారిటీ ఇచ్చిన ధోని


ఈ ఏడాది ఐపీయల్ లో దిగ్గజ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు ఏ మాత్రం కలిసి రావడంలేదు..ఒకప్పుడు ఓటమి అన్నది లేకుండా సాగిన ధోని సేన, ఈ ఏడాది మాత్రం వరుసగా పరాజయాలను ఎదుర్కొంటుంది..తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో ఓటమి చవిచూసింది..

చివరి ఓవర్లో అక్షర్ పటేల్ మూడు భారీ సిక్సర్లు బాడీ ఢిల్లీ కేపిటల్స్ కి విజయాన్ని అందించాడు..అయితే చెన్నై జట్టులో స్టార్ బౌలర్ బ్రేవో కి ఇంకా ఒక ఓవర్ ఉన్నప్పటికీ ధోని జడేజాతో చివరి ఓవర్ వేయించాడు ..దీనిమీద అనేక విమర్శలు వచ్చాయి ..అయితే ఆ విమర్శలకు ధోని క్లారిటీ ఇచ్చాడు ..

బ్రావో బౌలింగ్ చేయాల్సి ఉన్నాతాను ఫిట్ గా లేనని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు. జడేజా, కరణ్ శర్మ కు మాత్రమే చెరో ఓవర్ మిగిలి ఉన్నాయ్ దీంతో రిస్క్ అని తెలిసినా జడేజాకు అవకాశం ఇచ్చాను అని ధోని చెప్పాడు. కాగా జడేజా వేసిన ఆ ఓవర్ లో అక్షర్ పటేల్ ఏకంగా 3 సిక్సర్లు కొట్టి చెన్నైకి షాక్ ఇచ్చాడు.చెన్నై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 58, అంబటి రాయుడు 45, జడేజా 33 పరుగులు చేశారు.

Tags :
|
|

Advertisement