భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్ గా బీసీసీఐ తో ఎంపిఎల్ డీల్
By: Sankar Mon, 02 Nov 2020 11:30 AM
ప్రస్తుతం ఐపీఎల్-2020 స్పాన్సర్గా ఎంపీఎల్ వ్యవహరిస్తున్న విషయం తెలిపిందే. అయితే ఈ సంస్థ బీసీసీఐతో మరో ఒప్పందం చేసుకుంది. మూడు సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టుకు క్రికెట్ కిట్ స్పాన్సర్ చేసేందుకు ఒప్పందం చేసుకుంది.
ఎంపీఎల్ స్పాన్సర్గా ఐపీఎల్కు కేవలం ఈ ఒక్కసీజన్ మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో కొత్త డీల్ కుదుర్యుకున్న ఎంపీఎల్ భారత జట్టుకు నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023 వరకు ఉంటుంది. అంతేకాకుండా అపెక్స్ కౌన్సిన్ అధికారి మాట్లాడుతూ ఎంపీఎల్తో చేసుకున్న డీల్ గురించి వివరించారు. ‘బీసీసీఐ ఐపీఎల్-2020 స్పాన్సర్తో మరో పొత్తు కుదుర్చకుంది. అది డిసెంబర్ 2023 వరకు కొనసాగుతుంది.
అందుకుగానూ ఎంపీఎల్ మ్యాచ్కు రూ.65 లక్షలు చెల్లించనుంది. దాంతో మొత్తం ఒక్క సంవత్సరానికి రూ.3 కొట్లు చెల్లించనుంద’ని తెలిపారు. అయితే కరోనా కారణంగా నైక్ సంస్థ స్పాన్సర్ షిప్ మొత్తాన్ని తగ్గించమని కోరిందని అధికారులు తెలిపారు. దాంతో ఈ స్పాన్సర్ షిప్ను కూడా ఎంపీఎల్ సోంతం చేసుకుంది.