Advertisement

విశాఖలో అనుమతి లేదు - ఎంపీ విజయ సాయి రెడ్డి

By: Anji Sun, 20 Dec 2020 9:32 PM

విశాఖలో అనుమతి లేదు - ఎంపీ విజయ సాయి రెడ్డి

విశాఖలో బాక్సైట్ తవ్వకాలను అనుమతించమని ఎంపీ విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. ఒడిశా నుంచి బాక్సైట్ తెచ్చి అన్రాక్ పరిశ్రమ నడిపే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అన్రాక్ వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.

పరిపాలన రాజధాని విశాఖలో ప్రభుత్వ భూమిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

విశాఖ భూములపై సిట్ నివేదిక సిద్ధమని.. త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

పరిపాలన రాజధాని విశాఖలో ప్రభుత్వ భూమిలోనే కార్యాలయాలని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags :

Advertisement