Advertisement

  • ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సోము వీర్రాజు...!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సోము వీర్రాజు...!

By: Anji Tue, 24 Nov 2020 07:47 AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సోము వీర్రాజు...!

మేము సాఫ్ట్‌గా ఉన్నాం కదా అని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే చూస్తూ ఊరుకోము అని ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు.

బిజెపి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారన్నారు సోము వీర్రాజు.
చిత్తూరు జిల్లా రేణిగుంటలో జనసేన పార్టీ నాయకురాలు నగరం వినూతను పరామర్శించారు సోము వీర్రాజు. వినూత ఇంటిపై వైసిపి కార్యకర్త శివ దాడి చేసి కారు అద్దాలతో పాటు ఇంటిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో సోము వీర్రాజు రేణిగుంటకు చేరుకున్నారు.

ఎపిలో పోలీసులు అధికార పార్టీ నాయకులకు తాబేదారులుగా మారిపోయారని విమర్సించారు. జనసేన పార్టీ నాయకురాలు ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలన్నారు సోము వీర్రాజు.

Tags :

Advertisement