వీడియో ట్వీట్ చేసిన ఎంపీ రఘురామ...
By: chandrasekar Wed, 16 Dec 2020 10:58 PM
ముంబైలో జరిగిన తన గుండె
ఆపరేషన్ విజయవంతమైందని ఎంపీ అన్నారు. ఇటీవల ముంబైలో గుండెకు సంబంధించిన శస్త్ర
చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
అవుతున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని వీడియో ట్వీట్ చేసి తెలిపారు. సంపూర్ణ
ఆరోగ్యంగా కోలుకుని ఇంటికి చేరుకుంటున్నానని ముంబై నుంచి తాను హైదరాబాద్
వెళుతున్నట్లు రఘురామ చెప్పారు.
డాక్టర్లు తనకు కరోనా
ఉందని ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువ ఉన్నాయని గుండెకు సంబంధించిన సర్జరీ జరిగినప్పుడు
జాగ్రత్తగా ఉండాలని ఎవర్నీ కలవొద్దని చెప్పారన్నారు. మూడు, నాలుగు
వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారన్నారు. ఎవరినీ నేరుగా కలవకపోయినా ఫోన్లో
మాట్లాడుకుందాం, వీడియో కాల్స్ ద్వారా మట్కాడుకుందాం అన్నారు.
Tags :
mp |
tweeted |
the |