Advertisement

ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఆరోగ్యం మెరుగవుతోంది

By: chandrasekar Tue, 18 Aug 2020 00:13 AM

ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఆరోగ్యం మెరుగవుతోంది


కరోనా బారి నుంచి వేగంగా కోలుకుంటున్నానని టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్ ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు. టాలీవుడ్ మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఆరోగ్యం మెరుగవుతోంది. కరోనా వైరస్ బారి నుంచి తాను వేగంగా కోలుకుంటున్నట్లు మహారాష్ట్ర, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ తెలిపారు. దాదాపు 10 రోజుల కిందట ఆమె కుటుంబంలో 12 మంది సభ్యులకు కోవిడ్19 పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఆరోగ్యం కుదుట పడుతోంది.

కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నానని, తనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారని తన ఆరోగ్య పరిస్థితిపై నటి నవనీత్ కౌర్ వీడియో పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులు కూడా కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో, డాక్టర్లు, వైద్య సిబ్బంది చొరవతో ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. గత గురువారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి నవనీత్ కౌర్ కు చికిత్స అందిస్తున్నారు.

Tags :
|
|

Advertisement