Advertisement

  • క్షీణించిన అమరావతి ఎంపీ , సినీ నటి నవనీత్ కౌర్ ఆరోగ్యం

క్షీణించిన అమరావతి ఎంపీ , సినీ నటి నవనీత్ కౌర్ ఆరోగ్యం

By: Sankar Tue, 11 Aug 2020 12:13 PM

క్షీణించిన అమరావతి ఎంపీ , సినీ నటి నవనీత్ కౌర్ ఆరోగ్యం



మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ , సినీ నటి నవనీత్ కౌర్ కరోనా పాజిటివ్ భారిన పడిన విషయం తెలిసిందే ..అయితే ఆమె ఆరోగ్యం క్షీణించగా నాగ్‌పూర్‌లోని దవాఖానకు తరలించారు. నవనీత్‌ కౌర్‌ సహా కుటుంబంలోని 12 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల ఆమె పాజిటివ్‌గా పరీక్షించడంతో చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు.

అయితే, చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరారు. నవనీత్ కౌర్ భర్త రవి రానాకు ఆగస్టు 6న కరోనా పాజిటివ్‌గా తేలింది. తరువాత కుటుంబంలోని మొత్తం 12 మంది సభ్యులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో నవనీత్ కౌర్ పిల్లలు, అత్తమామలు కూడా ఉన్నారు.

కరోనా బారిన పడ్డామని నవనీత్‌ కౌర్‌, రవి రానా సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. గత కొద్ది రోజులుగా తమను కలిసి వారు పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. నవనీత్‌ కౌర్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. కొద్ది రోజుల కిందట రవి రానాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. శివనసేన ఎంపీ ఆనందరావును భారీ తేడాతో ఓడించారు.

Tags :
|
|
|
|
|

Advertisement