Advertisement

  • రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ భారత్ బంద్ కు ఏవిధంగా మద్దతు ఇస్తారు - కోమటిరెడ్డి

రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ భారత్ బంద్ కు ఏవిధంగా మద్దతు ఇస్తారు - కోమటిరెడ్డి

By: Anji Tue, 08 Dec 2020 09:31 AM

రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ భారత్ బంద్ కు ఏవిధంగా మద్దతు ఇస్తారు - కోమటిరెడ్డి

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈరోజు రైతుల భారత్ బంద్ పై స్పందించారు.

రాష్ట్రంలో వర్షాలకు నష్టపోయిన పంటని కొనని కేసీఆర్.. ఏ విధంగా బంద్ కుమద్దతు ఇస్తారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ సర్కారు... రైతు వ్యతిరేక బిల్లును ఏక పక్షంగా ఆమోదించారని విమర్శించారు. సోనియా గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు రైతులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా మోదీ సర్కారు రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు... రైతుల భారత్ బంద్కు మద్దతిచ్చే నైతిక హక్కు లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

సన్నరకం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల ఆందోళనలకు ఎలా మద్దతు తెలుపుతారని ఎద్దేవా చేశారు. రేపు జరిగే భారత్ బంద్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Tags :

Advertisement