పరిటాల రవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్.. పరిటాల సునీత ఆగ్రహం..
By: chandrasekar Thu, 10 Dec 2020 11:37 PM
ఎంపీ గోరంట్ల మాధవ్, పరిటాల
రవిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎంపీ రవిపై తీవ్ర
వ్యాక్యాలు చేశారు. పరిటాల రవి నక్సలైట్లు మరియు ఫ్యాక్షనిజం పేరుతో చాలా మంది
తలలు నరికారని టీటీడీ హయాంలో చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా ఇలాంటి పనులు చేశారని
అన్నారు. రవి రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే అతను రక్తపు
టేర్లతో పొలాలను తడిపారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ పంట పొలాలను రక్తంతో
తడిపిన చరిత్ర పరిటాల రవిది అని చెప్పారు.
ఎంపీ వ్యాఖ్యలపై సునీత
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై సునీత స్పందిస్తూ మాధవ్కు పరిటాల రవి
గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని, రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ
మరియు ఎస్టీలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అని అన్నారు. నీ చరిత్ర మాకు తెలుసు నీలా
రోడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం, మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది
లేదని పరిటాల సునీత ఆగ్రహంగా ప్రతిస్పందించారు.