Advertisement

  • నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తరలించారు ..ఎంపీ ధర్మపురి అరవింద్

నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తరలించారు ..ఎంపీ ధర్మపురి అరవింద్

By: Sankar Fri, 26 June 2020 7:34 PM

నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తరలించారు ..ఎంపీ ధర్మపురి అరవింద్



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శల వర్షం కురిపించాడు ..కేంద్రం కరోనా కు నిధులు ఇస్తే వాటిని కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తరలించారని ఆరోపించాడు ..కరోనా నియంత్రణలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు ..శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ప్రతి ఏటా హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలకు కేంద్ర రూ.50 కోట్లు ఇస్తుందని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన రూ.200 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఆర్ అండ్‌ బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సహకారంతో నిధులను కాళేశ్వరానికి మల్లించారని చెప్పారు.

కరోనా నిధులను కూడా కాళేశ్వరానికే తరలించారని వెల్లడించారు. వలస కార్మికులకు ఇచ్చిన నిధులను కూడా టీఆర్ఎస్ నేతలు మింగేశారని అరవింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 14 వేల వలస కార్మికులను గుర్తించి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగతా సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించారు. నాసిరకం సొయా విత్తనాలు సరఫరా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని గుర్తు చేశారు. పంచాయతీలు యూనిట్‌గా తీసుకుని రైతు వేదికలు నిర్మిస్తే సరిపోతుందని అరవింద్‌ అన్నారు.

Tags :
|
|
|

Advertisement