ధోనికి భారత రత్న ఇవ్వాలి ..మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ
By: Sankar Mon, 17 Aug 2020 10:33 AM
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే..అయితే ఇండియన్ క్రికెట్ లో సచిన్ తర్వాత అంతటి స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని.అయితే అంతటి పేరున్న ఆటగాడు అయిన ధోని అత్యంత సామాన్యంగా రిటైర్మెంట్ తీసుకోవడం వలన అయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు ..అయితే మరోవైపు ధోనికి భారత్ రత్న ఇవ్వాలని డిమాండ్ కూడా వస్తుంది.
ధోనీ రిటైర్మెంట్పై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్పరంగా భారత్కి ధోనీ మంచిపేరు తీసుకొచ్చాడు. కాబట్టి.. అతడ్ని దేశ అత్యుత్తమ పౌర పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించాలి. దేశానికి అతను ఓ ఆభరణం. భారత క్రికెట్ని అతను మరోస్థాయికి తీసుకెళ్లాడు’’ అని కితాబిచ్చాడు..
అయితే 2007-08లో క్రికెట్లో అత్యుత్తమంగా రాణించిన మహేంద్రసింగ్ ధోనీని ‘అర్జున అవార్డు’ వరించగా.. 2009లో దేశ నాలుగో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మశ్రీ కూడా దక్కింది. ఇక 2018లో దేశ మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ భూషణ్ని కూడా సగౌరవంగా అందుకున్న ధోనీకి తాజాగా భారత రత్న ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 2011 వన్డే ప్రపంచకప్లో టీమిండియాని విజేతగా నిలిపిన తర్వాత.. భారత ఆర్మీ అతనికి గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చింది. గత ఏడాది కాశ్మీర్లో రెండు వారాల పాటు ధోనీ జవాన్లతో కలిసి విధులు కూడా నిర్వర్తించాడు.