- హోమ్›
- వార్తలు›
- భోపాల్ గ్యాస్ దుర్ఘటన నొప్పిని ఇంకా తలుచుకుంటున్నాము ...మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్
భోపాల్ గ్యాస్ దుర్ఘటన నొప్పిని ఇంకా తలుచుకుంటున్నాము ...మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్
By: Sankar Thu, 03 Dec 2020 3:24 PM
భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 36 ఏండ్లు నిండిన సందర్భంగా బాధితులకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం నివాళులర్పించారు.
వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుర్ఘటన నుంచి ప్రపంచం పాఠం నేర్చుకునేందుకు త్వరలో స్మృతివనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.
‘భోపాల్ గ్యాస్ దుర్ఘటన తాలూకు నొప్పిని ఇంకా గుర్తు చేసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు ప్రపంచంలో ఏ మూలనా జరగకుండా భగవంతుడు చూడాలి. సమాజం, ప్రభుత్వం కలిసికట్టుగా ప్రజల వెలకట్టలేని జీవితాలను, భవిష్యత్ను సంరక్షించాలి’ అని ఆయన పేర్కొన్నారు. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ క్రిమిసంహాకర మందుల తయారీ ప్లాంట్లో 1984 డిసెంబర్ 2న రాత్రి మిథైల్ ఐసో సయనేట్ గ్యాస్ లీకై దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది.