పసిపాప కోసం తల్లి పాలను ప్రతి రోజూ విమానంలో తరలిస్తున్నారు
By: chandrasekar Sat, 18 July 2020 11:53 AM
నెల రోజులు కూడా నిండని ఓ
పసిపాపకు ఢిల్లీలో సర్జరీ అవుతోంది. ఆ బిడ్డకు ఇమ్యూనిటీ కోసం తల్లి పాలు చాలా
అవసరం. కానీ, ఆమె లడఖ్లోని లేహ్లో ఉంది. అసలే కరోనా వైరస్ తన
ప్రతాపం చూపిస్తోంది. పైగా ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. 1000
కి.మీ. దూరంలోని ఢిల్లీకి ఆమె వచ్చే పరిస్థితి లేదు.
దీంతో తల్లి పాలను
ప్రతి రోజూ విమానంలో తరలిస్తున్నారు. పసిపాపను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు
పడరాని కష్టాలు పడుతున్నారు. అంత దూరం నుంచి రోడ్డు మార్గాన తల్లి పాలు తరలించడం
కష్టం. ఒకవేళ తరలించినా అవి చేరే సమయానికి పనికి రాకుండా పోతాయి. అందుకే
విమానాన్ని ఎంచుకున్నారు. అలాగని భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని అనుకోవద్దు.
ఇదంతా మానవత్వంతోనే జరుగుతోంది. పాప తండ్రి స్నేహితుడొకరు లేహ్ ఎయిర్ పోర్టులో పని
చేస్తున్నాడు.
పాప కుటుంబ సభ్యులు ఆయన
ద్వారా లేహ్ ఎయిర్ పోర్టుకు ఆ తల్లి పాలను చేరవేరుస్తారు. అక్కడ నుంచి విమాన
సిబ్బంది ఆ పాలను ఢిల్లీ ఎయిర్పోర్టుకు తరలిస్తున్నారు. ఎయిర్పోర్టు బయటకి వచ్చే
ప్రయాణికుల ద్వారా ఆ పాలను అక్కడే వేచి చూస్తున్న తండ్రికి చేరవేస్తున్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టుకు
పాలు వచ్చే సమయానికి పాప తండ్రి అక్కడికి వెళ్తాడు. విమానాశ్రయం నుంచి పాలను
తీసుకొచ్చి ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి అందిస్తున్నాడు. వాళ్లు ఆ పాపకు పాలు
పడుతున్నారు.
ఇలా గత కొద్ది రోజుల
నుంచి జరుగుతోంది. ఆ తండ్రి పేరు జిక్మెత్ వాంగ్డూ పక్కా కశ్మీరీ. ఇంతకీ ఆ పాప
సమస్య ఏమిటంటే. పుట్టుకతోనే ఆ శిశువుకు ఆహార నాళం, శ్వాస నాళం రెండు కలిసిపోయాయి.
ప్రత్యేక సర్జరీ అవసరమని లేహ్ వైద్యులు చెప్పారు. దీంతో ఆ పాపను ఢిల్లీలోని
మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. శస్త్ర చికిత్సకు అంతా
సిద్ధం చేశారు. వారం రోజుల్లో ఆ పాప సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి కాబోతోంది. అంత
కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నాం అంటారా ఆమె ప్రాణాలు నిలపడం కోసం ఆ తల్లిదండ్రులు, వైద్యులే
కాదు ముక్కూ మొహం తెలియని ఎయిర్పోర్టు సిబ్బంది, ప్రయాణికులు కూడా నిండు
మనసుతో సాయం చేస్తున్నారు.