తన నాలుగో పెళ్ళికి అడ్డుగా వున్నాడని కన్న కొడుకునే చంపేసిన తల్లి
By: chandrasekar Mon, 28 Sept 2020 12:46 PM
తన నాలుగో పెళ్ళికి
అడ్డుగా వున్నాడని కన్న తల్లే తన సొంత
కొడుకుని చంపేసిన సంఘటన బిహార్లో చోటుచేసుకుంది.
కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి తన సుఖం కోసం ఆ బిడ్డనే చంపేసింది.
నాలుగో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నడానే కారణంతో నాలుగేళ్ల చిన్నారిని
చిదిమేసింది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం షాజహన్పూర్ పోలీసులు అందించిన వివరాలు
ప్రకారం ధర్మశీల దేవి అనే మహిళకు అరుణ్ అనే వ్యక్తితో తొలుత వివాహం అయింది. వీరికి
సజన్ కుమారు అనే బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైనా ఏడాదికే వాళ్లిద్దరు
విడిపోయారు.
ఇద్దరు విడిపోవడంతో ఆమె
రెండో పెళ్లి చేసుకుంది కానీ కొన్ని రోజులకు భర్త చనిపోయాడు. అనంతరం పట్నాలోని
ముస్తాఫాపూర్ చెందిన మహేష్ చౌదరిని మూడో పెళ్లి చేసుకుంది. అయితే రెండు నెలల
క్రితం మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆమె ప్రస్తుతం బహదూర్చౌక్లోని
తల్లిదండ్రలు వద్ద ఉంటుంది. ఆమె మరో పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇందుకు
వినికిడి, కంటి
చూపు సమస్యతో బాధపడుతున్న ఆమె కుమారుడు సజన్ అడ్డుగా ఉన్నాడని అనుకుంది. అందుకే
అతన్ని చంపాలని ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె శక్రవారం ఉదయం
కుమారుడిని చంపేసింది. కన్న కొడుకని కూడా కనికరం లేకుండా ఈ దారుణానికి పాల్పడింది.
కన్న బిడ్డను చంపడానికి
అతనిని నీటిలో మునిగిపోయేలా చేసి ప్రాణాలు తీసింది. ఇక, నీటిలో
ఓ బాలుడి మృతదేహం ఉన్నట్టు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కొందరు గ్రామస్థులు గుర్తించారు. ఈ
విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పలీసులు ఆ
మృతదేహం సజన్దిగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవిని అదుపులోకి
తీసుకున్నారు. పోలీసుల విచారణ సందర్భంగా దేవి ఆమె చేసిన నేరాన్ని అంగీకరించింది.
మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసమే తన కొడుకును చంపినట్టు తెలిపింది. ఈ కమ్రంలో
సజన్ తండ్రి అరుణ్ ఆచూకీ కనుగొని అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అనంతరం ధర్మశీల
దేవీపై కేసు నమోదు చేశారు. తన సుఖం కోసం కన్న బిడ్డనే కడతేర్చింది.