Advertisement

  • మానవ మృగంలా మారిన ఓ కొడుకు... కన్న తల్లిని ఏం చేశాడో తెలుసా...!

మానవ మృగంలా మారిన ఓ కొడుకు... కన్న తల్లిని ఏం చేశాడో తెలుసా...!

By: Anji Sun, 15 Nov 2020 5:50 PM

మానవ మృగంలా మారిన ఓ కొడుకు... కన్న తల్లిని ఏం చేశాడో తెలుసా...!

అమానుషంగా ప్రవరిస్తున్న కొందరు వావివరసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మృగాల కన్నా హీనంగా తయారవుతున్నారు. తాజాగా కర్ణాటక హవేరిలో జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం.

మానవ మృగంలా మారిన ఓ కొడుకు.. కన్న తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే దారుణమనుకుంటే.. తల్లి అని కూడా ఆలోచించకుండా గొంతునులిమి చంపేశాడు ఆ కీచకడు.

శివప్ప లామణి అనే వ్యక్తి ఈ నెల 12న తల్లిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసుల చొరవతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ దారుణం.

మృతురాలి భర్త ఆరేళ్ల క్రితం మరణించగా.. కొడుకు శివప్పతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం తెలిసిన శివప్ప... తల్లిపై కోపంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత రోజు శవాన్ని గుర్తించిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement