Advertisement

  • విషాద ఘటన... బిడ్డకు పాలల్లో విషం కలిపి చంపినా తల్లీ..!

విషాద ఘటన... బిడ్డకు పాలల్లో విషం కలిపి చంపినా తల్లీ..!

By: Anji Mon, 12 Oct 2020 10:07 AM

విషాద ఘటన... బిడ్డకు పాలల్లో విషం కలిపి చంపినా తల్లీ..!

అసలే పేదరికం. కరోనా సంక్షోభం వారి జీవితాలను మరింత వెక్కిరించింది. దీంతో ఆ మహిళ ఏ తల్లీ చేయకూడని పని చేసింది. కన్నప్రేమను చంపుకొని, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు పాలల్లో విషం కలిపి తాగించింది. దీంతో చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులు ఆ మహిళ చేసిన దారుణాన్ని బయటపెట్టారు.

ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. విల్లుపురం పాపానకుళం ప్రాంతానికి చెందిన సాధిక్‌ బాషా (35) ప్రైవేటు బస్‌ కండక్టర్‌‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య యాస్మిన్‌ (28), కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బస్సులు తిరగకపోవడంతో సాధిక్‌ బాషా పనిలేక ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు ముగ్గురు పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కష్టం అవుతుందని యాస్మిన్ భావించింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28న ఐదు నెలల చిన్నారికి యాస్మిన్‌ పాలుపట్టి పడుకోబెట్టింది. మరుసటి రోజున బిడ్డ మృతి చెందింది. సాదిక్‌ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు విల్లుపురం వెస్ట్‌ పోలీసులు విచారణ జరిపారు. గురువారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో బిడ్డకు పాలలో విషమిచ్చి చంపినట్లు తేలింది. దీంతో ఆ బిడ్డ తల్లి యాస్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :
|

Advertisement