Advertisement

  • ప్రకాశం జిల్లాలో విషాదం ..కొడుకు శవాన్ని చూసి తల్లి కూడా మృతి

ప్రకాశం జిల్లాలో విషాదం ..కొడుకు శవాన్ని చూసి తల్లి కూడా మృతి

By: Sankar Thu, 15 Oct 2020 8:28 PM

ప్రకాశం జిల్లాలో విషాదం ..కొడుకు శవాన్ని చూసి తల్లి కూడా మృతి


ప్రకాశం జిల్లాలో విషాదం ఘటన జరిగింది. కన్నకొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండె కూడా ఆగింది. ఒక మరణాన్ని తట్టుకోలేని ఆ కుటుంబానికి మరో విషాదం వెంటాడింది.

ఒకే రోజు తల్లి, తనయుడు.. ఇద్దరూ చనిపోవడంతో గ్రామంలోనూ విషాద చాయలు అలముకున్నాయి. అద్దంకి మండలం తిమ్మాయపాలెంకు చెందిన మాజీ సర్పంచ్‌ తోకల వెంకటేశ్వర్లు, రాగమ్మకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు సుబ్బారావు వ్యవసాయం చేస్తుంటాడు.

సుబ్బారావు బుధవారం తన మిత్రుడి ట్రాక్టర్ పొలంలో దమ్ము చేస్తూ బురదలో దిగబడటంతో.. దానిని బయటకు తీసేందుకు మరో ట్రాక్టర్‌తో ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ తిరగబడి సుబ్బారావు దాని కిందపడి కన్నుమూశాడు. స్థానికులు పొలం నుంచి సుబ్బారావు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.

సుబ్బారావు మృతదేహాన్ని చూసిన తల్లి రాగమ్మ ఆవేదన చెందింది. ఇక కుమారుడు లేడన్న బాధను తట్టుకోలేక అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయింది. సుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఒకే ఇంట్లో తల్లి, కుమారుడు మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి

Tags :
|
|

Advertisement