Advertisement

చంటిబిడ్డతో సహా మృతువాత పడ్డ తల్లి

By: chandrasekar Fri, 28 Aug 2020 8:44 PM

చంటిబిడ్డతో సహా మృతువాత పడ్డ తల్లి


చంటిబిడ్డతో సహా తల్లి కూడా మృతువాత పడ్డ సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. భర్త పనుల మీద బయట ఊరుకెళ్ళాడు. ఇంటికి సమీపంలో ఉన్న పొలానికి నీళ్లు పెడదామని చంటిబిడ్డతో సహా అతని భార్య వెళ్లింది. నీళ్లు పెట్టే క్రమంలో ఊహించని ప్రమాదం రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. తల్లీకొడుకులను అమాంతం మింగేసింది. ఈ అత్యంత విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లూరు మండలం రేమడూరు గ్రామానికి చెందిన మధు, సుజాత(27) ఇద్దరూ కూడా భార్యాభర్తలు వీరికి ఒక చిన్న మగబిడ్డ కూడా వున్నాడు.

ఆమె భర్త మధుకు ఏదో పని ఉండడంతో కర్నూలు వెళ్ళాడు. భర్త లేనందున నీరుపెట్టేందుకు సుజాత పొలానికెళ్లింది. నెలల బిడ్డను చంకలో పెట్టుకుని నీటి మోటార్ స్విచాన్ చేసేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌ తగలడంతో బిడ్డతో సహా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. చంకలో బిడ్డతో సహా తల్లి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. తల్లీకొడుకుల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఉలిందకొంద పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్తు స్విచ్ కి కూడా ప్రసరించడంతో ఈ సంఘటన జరిగివుండొచ్చని చెబుతున్నారు.

Tags :
|
|
|

Advertisement