అమర్ రాజా ఇన్ఫ్రాటెక్కు కేటాయించిన భూమిల్లో సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి
By: chandrasekar Wed, 01 July 2020 8:12 PM
ఉద్యోగాల కల్పన, సంస్థ
విస్తరణ లేకపోవడంతో 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం
పేర్కొంది. తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్, ఆయన కుటుంబానికి చెందిన
కంపెనీకి వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా
ఇన్ఫోటెక్కు కేటాయించిన భూమిలో సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి
తీసుకుంది. కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంగళవారం
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమర రాజా ఇన్ఫ్రాటెక్ నుంచి భూమిని
వెనక్కు తీసుకునేందుకు ఏపీఐఐసీకి పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
2010లో చిత్తూరు జిల్లా యడమర్రి మండలం కొత్తపల్లిలో
డిజిటల్ వరల్డ్ సిటీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని అమర్ రాజా ఇన్ఫ్రాటెక్కు ప్రభుత్వం కేటాయించింది. పదేళ్లు
దాటినా నిబంధనల ప్రకారం ఉద్యోగాల కల్పన, సంస్థ విస్తరణ లేకపోవడంతో 253
ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.