30 ఏళ్లుగా 40కిపైగా దొంగతనాలు
By: chandrasekar Mon, 26 Oct 2020 6:38 PM
ఓ మహిళా 30
ఏళ్లుగా 40కిపైగా
దొంగతనాలు చేస్తూ ఇప్పుడు పట్టు బడింది. 30 ఏళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను
తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు పరిశీలిస్తే వనితా గైక్వాడ్ అనే
మహిళ పని కావాలంటూ ఇళ్ల చుట్టూ తిరిగేది. ఏ ఇంట్లోనైనా పని దొరకగానే కొన్ని
గంటల్లోనే డబ్బు, విలువైన వస్తువులు దోచేసి అక్కడినుంచి పరారయ్యేది.
ఆమె ఈ నెల 19న
బాంద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో నగదు, బంగారు వస్తువులు, వజ్రాలు కాజేసి పరారయింది. ఇంటి యాజమాని ఫిర్యాదు
మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితతో పాటు ఆమెకు సహాయం చేసిన మరో వ్యక్తిని
కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె 1990నుంచి దాదాపు 30 ఏళ్లుగా 40కిపైగా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు
గుర్తించారు. వారినుంచి కాజేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
2019లో వనిత శాంతాక్రజ్లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో
పనిలో చేరిన గంటల్లోనే దొంగతనానికి పాల్పడిందని, 5.3లక్షల రూపాయల విలువైన
నగలను కాజేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కూడా ఆమెను అరెస్ట్ చేసినట్లు
వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు సేకరించాల్సి వుంది.