ఆంధ్రప్రదేశ్ లో నిత్యం 10వేలకు పైగా కరోనా కేసులు
By: chandrasekar Mon, 31 Aug 2020 3:34 PM
కరోనావైరస్ మహమ్మారి విజృంభణ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం 10వేలకు పైగా కరోనా కేసులు, వందకు చేరువలో మరణాల సంఖ్య నమోదవుతున్నాయి. గత 24గంటల్లో 10,603 కరోనా కేసులు నమోదు కాగా ఈ మహమ్మారి కారణంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య
4,24,767కి చేరుకోగా ఇప్పటివరకు 3,884 మంది ఈ మహమ్మారితో మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో
99,129 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు
3,21,754 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
గత 24గంటల్లో 63,077 టెస్టులు చేయగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36,66,422 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24గంటల్లో
9,067మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.