రవాణా శాఖలో ఆన్లైన్లో మరిన్నిసేవలు
By: chandrasekar Sat, 25 July 2020 08:11 AM
అజయ్ కుమార్ రవాణా శాఖలో
ఆన్లైన్లో మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ
ప్రమాణాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు
అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం రాష్ట్ర
పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజున ఐటీ శాఖ
సమన్వయంతో డూప్లికేట్ LLR పొందుట, డూప్లికేట్ లైసెన్స్ పొందుట, బ్యాడ్జి
మంజూరు, స్మార్ట్
కార్డ్ పొందుట, లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను ఆన్ లైన్ లో ఆయన
ప్రారంభించి మాట్లాడారు.
అక్రమాలకు అడ్డుకట్ట
వేసేందుకు ఇప్పటికే ఆధార్ను తప్పనిసరి చేశామని, ఇప్పటికే అనేక ఆన్లైన్
సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారని అన్నారు.
వాహనాల రిజిస్ట్రేషన్ల
కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. మధ్యవర్తులు, దళారులను
ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఈ నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ఆన్లైన్
చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల వెసులుబాటు కోసం శాఖలో మరిన్ని
సేవలు మరింత తేలికపాటిగా పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.