టీమిండియాకు షాక్ ..గాయంతో స్టార్ ఆటగాడు దూరం
By: Sankar Sun, 20 Dec 2020 12:22 PM
ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా దారుణ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే...ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి టీమిండియా చరిత్రలోనే అత్యంత తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది...అయితే ఈ ఓటమి షాక్ లోనే టీం ఇండియాకు ఇంకో షాక్ తగిలింది...స్టార్ బౌలర్ షమీ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు...
శనివారం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాట్ కమిన్స్ వేసిన బౌన్సర్ షమీ కుడి చేతికి తగలడంతో అతను గాయపడ్డాడు. దీంతో ఆట మధ్యలోనే రిటైర్డ్హర్ట్గా మైదానాన్ని వీడాడు. తీవ్ర నొప్పితో బాధపడిన షమీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ నిర్వహించారు. తన చేతికి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు తెలపడంతో షమీ సిరీస్లోని ఆఖరి మూడు టెస్టులకు దూరంకానున్నాడు.
దీనితో షమీ గాయం కారణం వలన జట్టులో ఉన్న సిరాజ్ , నవదీప్ సైనిలలో ఎవరో ఒకరికి స్థానం దక్కే అవకాశం ఉంది..ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ దూరం కాగా , ఇప్పుడు షమీ దూరం కావడం పెద్ద దెబ్బె అనుకోవచ్చు...