ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కైఫ్
By: Sankar Mon, 14 Dec 2020 9:12 PM
ఆస్ట్రేలియాలతో ఈ నెల పదిహేడు నుంచి టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్లో తలపడనుంది..తొలి టెస్ట్ అడిలైడ్ లో ప్రారంభం కానుంది..అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే మైదనాంలో ఆటగాళ్ల ఆటతో పాటు వారితో మాటల యుద్ధంలో కూడా తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది..అయితే మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్లెడ్జిన్గ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సోనీ స్పోర్ట్స్నెట్వర్క్తో మాట్లాడుతూ.. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కచ్చితంగా స్లెడ్జింగ్కు దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అదే సమయంలో ఫించ్, వార్నర్, స్మిత్ వంటి ఆటగాళ్లు మాత్రం సంయమనంగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చాడు.
వారంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆటగాళ్లు కావడమే ఇందుకు కారణం అని పేర్కొన్నాడు. ‘‘ ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు ఆరోన్ ఫించ్ గానీ, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ వంటి వాళ్లు భారత ఆటగాళ్లతో వాగ్యుద్దానికి దిగే అవకాశమే లేదు. కానీ టిమ్ పైన్ అలా కాదు. అతడు ఐపీఎల్ ఆడటం లేదు.దీనితో భారత ఆటగాళ్లపై మాటల యుద్దానికి దిగడానికి అతడు ఏ మాత్రం వెనుకాడడు అని కైఫ్ అన్నాడు