Advertisement

  • భారత్‌లో ట్విటర్లో అత్యధికంగా ఫాలోవర్లు మోదీకే

భారత్‌లో ట్విటర్లో అత్యధికంగా ఫాలోవర్లు మోదీకే

By: chandrasekar Mon, 20 July 2020 1:14 PM

భారత్‌లో ట్విటర్లో అత్యధికంగా ఫాలోవర్లు మోదీకే


సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది. తాజాగా మోదీ ట్విటర్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 6 కోట్లు దాటింది.

భారత్‌లో ట్విటర్లో అత్యధికంగా ఫాలోవర్లు మోదీకే ఉన్నారు. 2009లో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు.

2014లో ప్రధాని పదవి చేపట్టడంతో ఆయనకు ఆదరణ బాగా పెరిగింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా ట్వీట్లు చేస్తున్నారు.

దేశ విదేశాల్లో ఆయన పర్యటనలు, తాను కలిసి ముఖ్యవ్యక్తుల వివరాలు, వివిధ వేదికల్లో ఆయన చేసిన ప్రసంగాలు తదితర అంశాలపై మోదీ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.

ప్రధాని మోదీ అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రపంచస్థాయి నాయకుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 120 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ 83 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

Tags :
|

Advertisement