Advertisement

  • శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ..బయటకు పరుగులు తీసిన సిబ్బంది..

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ..బయటకు పరుగులు తీసిన సిబ్బంది..

By: Sankar Wed, 02 Sept 2020 8:22 PM

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ..బయటకు పరుగులు తీసిన సిబ్బంది..


శ్రీశైలంలో ఇటీవల జరిగిన ఆగని ప్రమాదం గురించి అందరికి తెల్సిందే.ఆ ఆగని ప్రమాదం తీరని శోకాన్ని మిగిలించింది..అయితే అది జరిగి పది రోజులు తిరగకుండానే మల్లి శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది..బుధవారం సాయంత్రం భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో భయంతో పవర్‌ ప్లాంట్‌ సిబ్బంది బయటకు పరుగులు తీశారు.

కరెంట్‌ కేబుల్‌ పైనుంచి డీసీఎం వ్యాన్‌ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు లో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు ప్రభాకరరావు స్పష్టం చేశారు.

త నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జెన్‌కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించమని సీఎండీ ప్రభాకరరావు ఆదేశించారు. సిఎండి అదేశాలతోనే మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు.

Tags :

Advertisement