Advertisement

  • పట్టభద్రుల ఓటరు నమోదుపై విచారణ రేపటికి వాయిదా...!

పట్టభద్రుల ఓటరు నమోదుపై విచారణ రేపటికి వాయిదా...!

By: Anji Thu, 05 Nov 2020 2:47 PM

పట్టభద్రుల ఓటరు నమోదుపై విచారణ రేపటికి వాయిదా...!

పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. డిసెంబర్ 7 వరకు నమోదు గడువును పొడిగించాలన్న తన అభ్యర్థనపై ఎన్నికల సంఘం స్పందించడం లేదని న్యాయవాది రమేష్ హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే అక్టోబర్ 1 నుంచి నవంబరు 7 లోగా దరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రాష్ట్రంలో విపత్తులు వచ్చినా, ప్రజల ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా? అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.

అయితే, డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది రమేష్ ఇచ్చిన వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో రేపటిలోగా తెలపాలని ఈసీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవడంపై స్పష్టత ఇవ్వాలని ఈసీని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు

Tags :
|

Advertisement