గత ఇరవై ఏళ్లలో ఇంత ఎక్కువ పోలింగ్ నమోదు అవ్వలేదు ...ఎమ్యెల్సీ కవిత
By: Sankar Wed, 02 Dec 2020 5:21 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సెంచరీ కొడతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.
గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ నమోదైందని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ విమర్శలు చేస్తూ పోలింగ్పై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బుధవారం తొలిసారి కరీంనగర్కు వచ్చిన కవిత పాత బజార్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివుడికి అభిషేకం నిర్వహించి గౌరీమాత పూజలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్తో కలిసి శివాలయంతో పాటు దాని ప్రక్కనే ఉన్న కరీముల్లాషా దర్గాను సందర్శించి చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు
Tags :
comments |
ghmc |