Advertisement

  • హిందూపురంలో పర్యటించిన బాలయ్య ..కరోనా తగ్గడానికి మంత్రాన్ని చెప్పిన బాలకృష్ణ

హిందూపురంలో పర్యటించిన బాలయ్య ..కరోనా తగ్గడానికి మంత్రాన్ని చెప్పిన బాలకృష్ణ

By: Sankar Mon, 31 Aug 2020 3:24 PM

హిందూపురంలో పర్యటించిన బాలయ్య ..కరోనా తగ్గడానికి మంత్రాన్ని చెప్పిన బాలకృష్ణ


హిందూపురంను జిల్లాగా ప్రకటించాలని.. దీని కోసం ఎంత దూరమైన వెళతానని.. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా కలిసి కోరతానని చెప్పుకొచ్చారు. బాలయ్య ఇటీవలే హిందూపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. జిల్లాల పునర్విభజన జరిగితే హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తాజాగా మరోసారి వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపులు చర్యలే ఎక్కువ ఉన్నాయని.. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కన్నా అధిక ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. బాలయ్య సోమవారం హిందూపురంలో పర్యటించారు.. ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రికి రూ.55 లక్షల విలువ చెసే వైద్య పరికరాలను అందజేశారు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఐదు నెలల నుంచి హిందూపురం వెళ్లలేకపోయిన ఆయన.. సోమవారం పర్యటనకు వెళ్లారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు. ఇటీవల రూ.55 లక్షలు తన సొంత నిధులు వెచ్చించి హిందూపూర్ కొవిడ్ ఆసుపత్రికి కరోనా నియంత్రణ వైద్య పరికరాలు, మందులు ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ఆయనే పాల్గొన్నారు. బాలయ్యకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు..

ఇక అయితే బాలయ్య కరోనా నివారణకు మంత్రాలు సూచించారు..ఈ మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా రాదన్నారు.కరోనా, లాక్‌డౌన్ కావడంతో బాలయ్య హైదరాబాద్‌కు పరిమితం అయ్యారు. తన నియోజక వర్గంలో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారుల్ని అలర్ట్ చేస్తున్నారు

Tags :
|
|

Advertisement