Advertisement

  • కరోనా తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరు అయి పెద్ద మనసు చాటుకున్న వైసీపీ ఎమ్యెల్యే

కరోనా తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరు అయి పెద్ద మనసు చాటుకున్న వైసీపీ ఎమ్యెల్యే

By: Sankar Fri, 28 Aug 2020 10:42 AM

కరోనా తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరు అయి పెద్ద మనసు చాటుకున్న వైసీపీ ఎమ్యెల్యే


ఇంతకుముందు ఎవరైనా చనిపోతే వారిని అత్యంత ఘనంగా ఉరేగించుకుంటూ వాయిద్యాలతో అందరు కలిసి స్మశానానికి తీసుకోని వెళ్లి ఆ వ్యక్తి యొక్క చివరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేవారు ..అయితే కరోనా వచ్చిన తర్వాత ఇదంతా పూర్తిగా మారిపోయింది..చనిపోయిన వ్యక్తి దగ్గరకు సొంత బంధువులు కూడా వెళ్లడం లేదు..

ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఎదురయ్యాయి. కానీ చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం స్థానికులు చొరవ చూపించారు. ఊరి మధ్య శ్మశానంలో కొవిడ్‌ బాధితుడి అంత్యక్రియలు చేశారు. స్థానికుల్ని ప్రశంసించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వయంగా మృతదేహం ఉన్న స్ర్టేచర్‌ను మోశారు.

తిరుపతి రూరల్‌ పేరూరు మాజీ సర్పంచ్‌ బచ్చల గురువారెడ్డి కరోనాతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. గురువారెడ్డి ఇంటి దగ్గర మృతదేహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మృతదేహం ఉంచిన స్ట్రెచర్‌ను ఎమ్మెల్యే మోశారు. గ్రామం మధ్యలో ఉన్న శ్మశానంలో కొవిడ్‌ మృతుడి అంత్యక్రియలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. పేరూరు ప్రజలను ఆదర్శంగా తీసుకొని ఇతర ప్రాంతాల ప్రజలూ కొవిడ్‌ మృతులపట్ల గౌరవ భావంతో ఉండాలని చెవిరెడ్డి కోరారు.

Tags :
|
|

Advertisement