Advertisement

తెలంగాణాలో కరోనాతో మరో పోలీస్ అధికారి మృతి

By: Sankar Thu, 03 Sept 2020 1:23 PM

తెలంగాణాలో కరోనాతో మరో పోలీస్ అధికారి మృతి


తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది... కాస్త తగ్గినట్టుగానే కనిపించినా కరోనా కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి.. మరోవైపు.. మంత్రులు, అధికారులు, లీడర్లు.. ఇలా ప్రముఖులను కూడా కరోనా వదలడంలేదు. కొందరి ప్రాణాలను కూడా తీస్తోంది కరోనా వైరస్... ఇప్పటికే పలువురు నేతలు, అధికారులు కరోనాతో మృతిచెందగా...

తాజాగా, తెలంగాణలో మరో అధికారి కరోనాకు బలైపోయారు. ఈ నెల 18వ తేదీన కరోనా సోకడంతో మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మియపూర్ ఏఎస్‌ఐ విశ్వనాథం... నిన్న కన్నుమూవారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో... బుధవారం మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు..

కాగా గడిచిన 24 గంటల్లో 2,817 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 856కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 2611 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,00,013.

Tags :
|
|
|

Advertisement