అదృశ్యమైన చిన్నారి సౌమ్య...ఎల్లారెడ్డిలో శవంగా తేలిన వైనం...!
By: Anji Wed, 04 Nov 2020 2:31 PM
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం మత్తమాల గ్రామంలో అదృశ్యమైన చిన్నారి సౌమ్య విగతజీవిగా కనిపించింది.
ఈ ఉదయం నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో సౌమ్య మృతదేహం బయటపడింది. అయితే, రెండేళ్ల చిన్నారి మృతి స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
ఇంటిముందు ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారి సౌమ్య ఎలా ప్రాణాలు కోల్పోయిందన్నది పెద్ద మిస్టరీగా మారింది.
ఎవరైనా అపహరించి చిన్నారిని హత్య చేసారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
Tags :
died |
missing |
soumya |