Advertisement

రోహిత్ శర్మ లేకపోవడం పెద్ద లోటు ..ఆకాష్ చోప్రా

By: Sankar Fri, 27 Nov 2020 07:28 AM

రోహిత్ శర్మ లేకపోవడం పెద్ద లోటు ..ఆకాష్ చోప్రా


ఆస్ట్రేలియాతో రేపట్నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ లేకపోవడం పెద్ద లోటని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్‌ జట్టు పటిష్టంగా ఉన్నప్పటికీ రోహిత్‌ శర్మ సేవలు అందుబాటులో లేకపోవడం ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. తన యూట్యూబ్‌ చానెల్‌లో రోహిత్‌ శర్మ గైర్హాజరీ అంశంతో పాటు టీమిండియా ఓపెనింగ్‌, జట్టు ఎలా ఉండబోతుందనే విషయాలపై ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు..

ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది రోహిత్‌ లేకపోడమే. దాంతో భారత వన్డే, టీ20 జట్టు తరఫున శిఖర్‌ ధావన్‌కు తోడుగా ఎవరు ఓపెనింగ్‌కు దిగుతారనేది చాలా క్లిష్టమైన ప్రశ్న. మనం మయాంక్‌ అగర్వాల్‌ను ధావన్‌కు తోడుగా ఓపెనర్‌గా చూస్తామా అనేది ఒకటైతే, సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉంది.

నా వరకూ అయితే ధావన్‌కు జతగా రాహుల్‌ ఓపెనర్‌గా దిగితేనే బాగుంటుంది. రాహుల్‌ ఒక మంచి ఓపెనర్‌. అతను ఓపెనర్‌గా దిగి శతకాలు చేస్తున్నాడు. రాహుల్‌ ఓపెనర్‌గా దిగి ఆటపై ఇంకా బాగా దృష్టిపెడితే అతను డబుల్‌ సెంచరీ కూడా చేయగలడు’ అని చోప్రా తెలిపాడు.

Tags :
|

Advertisement