నెల్లూరు జిల్లాలో మిస్సైల్ శకలం...
By: chandrasekar Mon, 07 Dec 2020 11:59 AM
నెల్లూరు జిల్లాలో
పెదపాళెం సముద్ర తీరంలో మిస్సైల్ శకలం కనిపించడంతో స్థానికులు అవాక్కయ్యారు.
వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏం జరిగిందని ఆరా తీశారు.
ఇస్కపల్లి మెరైన్ సీఐ పెంచలరెడ్డి, ఎస్ఐలు రసూల్ సాహెబ్, మహేంద్రలు శకలాలను
పరిశీలించారు. ఆ శకలం జెట్ విమాన శకలం కాదని, ఎయిర్ఫోర్స్ మిస్సైల్ అని మెరైన్ నిర్థారించారు.
దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మిస్సైల్ శకలం గుంటూరు
జిల్లా సూర్యలంక తీరం నుంచి గతంలో ఎయిర్ఫోర్స్ అధికారులు ప్రయోగించిన మిస్సైల్
అని మెరైన్ పోలీసులు తేల్చారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో
తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఇలాంటివి మూడు ప్రయోగించగా..
ఇప్పటికి 2 లభించాయని తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో
మరొకటి బయటపడిందన్నారు. దీన్ని ఇస్కపల్లి మెరైన్ పోలీస్స్టేషన్కు తరలించి
మెరైన్ అధికారులకు సమాచారం ఇచ్చామని త్వరలోనే వారు దీనిని తీసుకువెళతారని
పేర్కొన్నారు.