Advertisement

  • మ‌హిళ‌ల‌పై అకృత్యాలు...ఢిల్లీ శివార్ల‌లో మ‌రో అఘాయిత్యం

మ‌హిళ‌ల‌పై అకృత్యాలు...ఢిల్లీ శివార్ల‌లో మ‌రో అఘాయిత్యం

By: chandrasekar Tue, 06 Oct 2020 5:45 PM

మ‌హిళ‌ల‌పై అకృత్యాలు...ఢిల్లీ శివార్ల‌లో మ‌రో అఘాయిత్యం


యూపీలోని హ‌థ్రాస్‌లో 20 ఏండ్ల యువ‌తి సామూహిక హ‌త్యాచార ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఢిల్లీ శివార్ల‌లో మ‌రో ఘటన జరిగింది. 24 ఏండ్లలోపు నలుగురు యువకులు వ‌య‌స్సులో వారికంటే పెద్దవ‌య‌స్సులో ఉన్న‌యువ‌తిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ నిందితుల‌ను గంట‌ల సమయంలోనే పోలీసులు అరెస్టు చేశారు.

హ‌ర్యానాలోని గుర్‌గావ్‌లో ఉన్న సికంద‌ర్పూర్ మెట్రోస్టేష‌న్‌లో శ‌నివారం రాత్రి 25 ఏండ్ల యువ‌తి రైలుకోసం నిరీక్షిస్తు౦డగా ఆమె వ‌ద్ద‌కు వెళ్లిన యువ‌కుడు డీఎల్ఎఫ్ ఫేజ్ 2లో ఉన్న రియ‌ల్ట‌ర్ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అనంత‌రం అక్క‌డికి మ‌రో ముగ్గురు యువ‌కులు చేరుకున్నారు. వారిలో ఒక యువ‌కుడు ఆ ఆఫీసులో ప‌నిచేస్తున్నాడు. అత‌ని వ‌ద్ద దానికి సంబంధించిన తాళంచెవి ఉండ‌టంతో ఆమెను బ‌ల‌వంతంగా లోప‌లికి తీసుకువెళ్లి అత్యాచార౦ చేసారు. ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆమెపై దాడి చేశారు. ఈ క్ర‌మంలో ఆమె త‌ల గోడ‌కు బ‌లంగా తాక‌డంతో తీవ్రంగా గాయాల‌య్యాయి. అనంత‌రం వారంతా అక్క‌డి నుంచి పారిపోయారు. యువ‌తి అరుపులు విన్నసెక్యూరిటీ గార్డు పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితురాల‌ని హాస్పిటల్ ‌కు త‌ల‌రించారు.

అయితే నిందితుల‌ను గంట‌ల వ్య‌వ‌ధిలోనే అరెస్టు చేశామ‌ని ఏసీపీ క‌ర‌ణ్ గోయ‌ల్ తెలిపారు. వారంతా 20 నుంచి 24 ఏండ్ల యువ‌కుల‌ని పేర్కొన్నారు. అందులో ముగ్గురు డెలివ‌రీ బాయ్స్‌గా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. బాధితురాలు ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆమెను తీవ్రంగా హింసించార‌ని, ఆమె త‌ల‌ను గోడ‌కు కొట్టార‌ని చెప్పారు. నిందితుల‌పై కేసు న‌మోదుచేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.

Tags :

Advertisement