Advertisement

అమ్మతో స్నేహం... బాలికపై అఘాయిత్యం

By: Dimple Mon, 07 Sept 2020 09:13 AM

అమ్మతో స్నేహం... బాలికపై అఘాయిత్యం

అమ్మతో కలసి పనిచేసే ఉద్యోగులు... దుర్మార్గానికి ఒడిగట్టారు. మైనరు బాలికపై పైశాచికత్వాన్ని ప్రదర్శించన దారుణఘటన ఒడిశాలో వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇందులో ఇద్దరు తల్లితో పాటు పనిచేసే ఉద్యోగులు కాగా.. ఓ పోలీసు అధికారి ఉన్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక తల్లి ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్నారు. దీంతో ఇద్దరూ కలిసి ఇన్ఫోసిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యలు ఇక్కడికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. రెండు నెలల క్రితం ఆమె తల్లి విధుల్లో ఉండగా.. ఆమె సహచర ఉద్యోగులు ఇంటికి వచ్చి బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టారు. వారితో పాటు ఓ పోలీసు అధికారి, ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, బాలికకు తెలిసిన మరో ఇద్దరు వ్యక్తులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది.

కొన్ని రోజుల తర్వాత జరిగిన ఘోరాన్ని బాలిక తన తల్లికి వివరించింది. దీంతో ఆమె తన సహచర ఉద్యోగులను ప్రశ్నించింది. ఆమెనూ చంపేస్తామని బెదిరించడంతో తమ సొంతూరు వెళ్లిపోయింది. తిరిగి ఆగస్టులో నగరానికి చేరుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టించుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Tags :
|
|
|

Advertisement