Advertisement

  • ఈ సారి కూడా విజయం మాదే ... జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయంపై మంత్రి వేముల ధీమా

ఈ సారి కూడా విజయం మాదే ... జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయంపై మంత్రి వేముల ధీమా

By: Sankar Sun, 15 Nov 2020 05:26 AM

ఈ సారి కూడా విజయం మాదే ... జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయంపై మంత్రి వేముల ధీమా


జిహెచ్ఎంసి పై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి ఎన్నికల సమాయత్తంలో భాగంగా శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుతో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్ల లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించామన్నారు. ఒక్కో డివిజన్ కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే ను ఎన్నికల బాధ్యులుగా నియమిస్తామని, తాను కూడా ఒక డివిజన్ బాధ్యత తీసుకొని ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా పనిచేస్తామని వెల్లడించారు.

Tags :

Advertisement